Blog

సిద్ధం పాటల సిడిని ఆవిష్కరించిన వైయస్ భారతి

సిద్ధం పాటల సీడీని ఆవిష్కరించిన వైఎస్ భారతి పులివెందుల మన జనప్రగతి మే 06:- ఈ నెల 13న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన సిద్ధం పాటల సీడీని అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఆవిష్కరించారు. పులివెందులలోని వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సిడిని ఆవిష్కరించిన అనంతరం సిడి నిర్మాణ బాధ్యత వహించిన ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ఐ సూర్యనారాయణ (జపాన్)ను,పాటల రూపకర్త సూర్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ ఎం ప్రభాకర్ ను ప్రత్యేకంగా అభినందించారు. డా.ప్రభాకర్ మాట్లాడుతూ జన హృదయాల్లోకి చొచ్చుకొని పోయే శక్తి పాటకు ఉందని, జనం బాగుకోసం నిరంతరం తపించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమం, అభివృద్ది గురించి ఎంత చెప్పినా తక్కువే అని, అందుకే ఆయన చేస్తున్న సంక్షేమ యజ్ఞాన్ని పాటల రూపంలో గ్రామ స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామన్నారు. సోషల్ మీడియా ద్వారా కోట్లాది అభిమానులకు ఈ పాటలను అందుబాటులోకి తెస్తామని అన్నారు.ఈ ఎన్నికలలో జగన్ ను గెలిపించడానికి జనమే సిద్ధంగా ఉన్న పరిస్థితికి ఈ గేయాలు అద్దం పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడి రూపకల్పనకు సహకరించిన బుదాటి రామ తులసి, డా .వత్తలూరి ఉష, నల్లపరెడ్డి సుదీప్ రెడ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button