BlogKadapaLatest

వైసీపీతోనే పేదలకు సంక్షేమ పథకాలు

వైసీపీ ప్రభుత్వంతోనే పేదలకు సంక్షేమ పథకాలు ఉంటాయని వైకాపా మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందుల పట్టణంలోని నారాయణ కాలేజ్ వద్ద సోమవారం మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలనుతాయని లేకపోతే సంక్షేమ పథకాలు దూరం అవుతాయన్నారు. కావున వైసిపి ఫ్యాన్ రాను గుర్తుకు ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ అభ్యర్థిగా, వైయస్ అవినాష్ రెడ్డిని లోక్ సభ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ హఫీజ్, సివిల్ సప్లై డైరెక్టర్ గంగాధర్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ చంద్రమౌళి, కౌన్సిలర్లు పార్నపల్లి కిషోర్, కోడి రమణ, మురళి, లక్ష్మీ భార్గవి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ize-medium wp/>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button