యువతిని దుబాయ్ షేక్కు అమ్మేసిన ఏజెంట్

హైదరాబాద్: నగరానికి చెందిన యువతి ఓ ట్రావెల్ ఏజెంట్ మోసానికి బలైపోయింది. దుబాయ్ షేక్ చేతికి చిక్కి నరకం అనుభవిస్తోంది. వివరాలు.. నూర్ అనే యువతిని ట్రావెల్ ఏజెంట్ ఒకరు దుబాయ్కు పంపిస్తామని మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో రెండు లక్షలు తీసుకుని దుబాయ్ షేక్కు ఆమెను అమ్మేశాడు. అనంతరం అతడితో బలవంతంగా కాంట్రాక్ట్ మ్యారేజీ చేయించాడు. అప్పటి నుంచి దుబాయ్ షేక్ నూర్పై అత్యాచారానికి పాల్పడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు.
అతడు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక అతడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న నూర్.. మరోచోట తలదాచుకుంది. ఈ విషయం తెలుసుకున్న షేక్.. ఆమె ఆచూకీ కనిపెట్టి ఇంటికి తీసుకువచ్చి మళ్లీ హింసించడం ఆరంభించాడు. అతడికి తెలియకుండా తన తల్లికి ఫోన్ చేసిన నూర్.. తనను ఎలాగైనా కాపాడాలంటూ వేడుకుంది. ఈ విషయం గురించి మీడియాతో గోడు వెళ్లబోసుకున్న ఆమె తల్లి.. తన కుమార్తెను ఎలాగైనా రక్షించి హైదరాబాద్కు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.