మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 51 వేలకు చేరింది.
ముంబై: మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 51 వేలకు చేరింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేల వరకు పాజిటివ్ కేసులు, 50కి పైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 2,771 కరోనా కేసులు, 56 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,21,184కు, మరణాల సంఖ్య 51,000కు చేరింది.మరోవైపు గత 24 గంటల్లో 2,613 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,25,800కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 43,147 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మరోవైపు గత 24 గంటల్లో 2,613 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,25,800కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 43,147 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.