బాబుకు క్షమాపణ చెప్పాలి.. అచ్చెన్నాయుడు

టీడీపీ అధినేత చంద్రబాబును రేణిగుంట ఎయిర్పోర్టులో పోలీసులు అడ్డుకోవడంపై ఆ పార్టీ కీలక నేతలు, కార్యకర్తలు, వీరాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును పోలీసులు క్షమాపణ చెప్పి బందోబస్తు ఇచ్చి తీసుకెళ్లాలి. ఇవాళ ఉదయం నుంచి జరిగిన ఈ మొత్తం వ్యవహారంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నోటీస్ చూస్తే పోలీసులు బుర్ర పెట్టి పని చేస్తున్నారా..? లేదా..? అనేది అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు ఆటంకం కలుగుతుందని పోలీసులు అడ్డుకుంటున్నారని అడ్డుకుంటున్నారా..? అని పోలీసులపై అచ్చెన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పట్టణ ప్రాంతంలో ప్రజలు చాలా కోపంతో ఉన్నారు. ప్రజలు ఓటు ద్వారా సీఎం వైఎస్ జగన్, చితక కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అభ్యర్థులను భయపెట్టి, యునానిమస్ చేసుకోవాలని కుట్ర వైసీపీ చేస్తుంది.
ప్రతిపక్ష పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఎస్పీని కలెక్టర్ని కలవటానికి వెళితే ఇబ్బంది ఏంటి..?. విశాఖపట్నంలో ఒక బ్రోకర్ పాదయాత్ర చేసి అంబులెన్స్లకు అడ్డు పడినప్పుడు మీకు కనిపించలేదా..?. చంద్రబాబు ఎయిర్పోర్టు నుంచి బయటికి వెళ్లకుండా ఇబ్బందులను చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. జగన్ అప్పుడు కుక్కలా తిరిగాడు.. అప్పుడు ఆ రోజు పోలీసులు సపోర్ట్ ఇచ్చాము. చంద్రబాబు పోలీసులు క్షమాపణ చెప్పి బందోబస్తు ఇచ్చి తీసుకెళ్లాలి. మొత్తం వ్యవస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో నడుపుతున్నారు. మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు ప్రజలు తిరగబడవలసిన అవసరం ఉంది. స్వతంత్ర భారతదేశంలో మొదటి సారి, క్యాంపులు పెట్టే దుస్థితి తీసుకొచ్చారు. ఓటమి భయంతోనే జగన్ ఇదంతా చేస్తున్నారు’ అని అచ్చెన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు