నేడు కడపకు ముఖ్యమంత్రి.. రాక
కడప, మార్చి 28
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 4.20 గంటలకు ముఖ్యమంత్రి కడపకు రానున్నారు. నగరంలోని కో ఆపరేటివ్ కాలనీలోని వందన అపార్ట్మెంట్లోని బద్వేలు ఎమ్మెల్యే దివంగత డాక్టర్ వెంకటసుబ్బయ్యకు నివాసానికి వెల్లి నివాళులు అర్పించేందుకు సీఎం జగన్ రానున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 4.15 గంటలకు సిఎం కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి 4.20 బయలుదేరి 4.45 గంటలకు కో ఆపరేటివ్ కాలనీలోని డాక్టర్ వెంకటసుబ్బయ్య నివాసానికి చేరుకుంటారు. అక్కడ ఆయన మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 5.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.40 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని తర్వాత తాడేపల్లెలోని ఆయన నివాసానికి వెలతారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సిఎం కార్యాలయం నుంచి కలెక్టర్కు సామాచారం అందింది. . గత కొంత కాలంగా క్యాన్సర్ తో వెంకటసుబ్బయ్య బాదపడుతున్నారు. 2019 లో మొదటి సారి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి డాక్టర్ వెంకట సుబ్బయ్య గెలిచారు. కడపలోని అరుణాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 6.30 కు తుది శ్వాస విడిచారు.