గుంటూరులో వ్యాక్సిన్ వేయించుకున్నా సీఎం వైఎస్ జగన్ దంపతుల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరులోని భారత్పేటలోని 140వ వార్డు సచివాలయానికి సతీమణి వైఎస్ భారతితో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం వార్డు/గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. మూడు నెలల్లో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. గ్రామాల్లో వ్యాక్సినేషన్పై వాలంటీర్లకు అవగాహన కల్పిస్తారు. ఇంటింటికీ వెళ్లి 45 ఏళ్లు దాటినవారి వివరాలను వాలంటీర్లు దగ్గరుండి సేకరిస్తారు. ఏ రోజు వ్యాక్సినేషన్ జరుగుతుందో ముందుగానే వాలంటీర్లు చెబుతారు. ప్రతీ మండలంలోని పీహెచ్సీల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అని తెలిపారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యాక్సిన్ కేంద్రం, వ్యాక్సిన్ రూమ్, అబ్జర్వేషన్ రూమ్ను హోం మంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్ వివేక్యాదవ్లు బుధవారం పరిశీలించిన సంగతి తెలిసిందే.