కర్ణాటకలో కొత్త కరోనా స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది
కర్ణాటకలో కొత్త కరోనా స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలో 29 కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. యూకే నుంచి ఇండియా వచ్చిన వారిలోనే ఈ వైరస్ బయటపడుతున్నది. దీంతో యూకే నుంచి వచ్చిన ప్రయాణికులపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆర్టిపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె తాజాగా యూకే నుంచి వచ్చిన 18 మందిలో కొత్త కరోనా స్ట్రెయిన్ బయటపడింది. దీంతో కర్ణాటక రాష్ట్రం అప్రమత్తం అయ్యింది. ఇంకా 185 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉన్నది. కరోనాకు వ్యాక్సిన్ కు అనుమతులు వచ్చిన సమయంలోనే పెద్ద సంఖ్యలో కొత్త స్ట్రెయిన్ కేసులు బయటపడుతుంటడం కొంత ఆందోళన కలిగిస్తోంది.కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తుందని ఇప్పటికే తేలింది. సాధారణ కరోనా వైరస్ కంటే కూడా ఈ కొత్త స్ట్రెయిన్ 70శాతం వేగంగా విస్తరిస్తోంది. ఇదే ఇప్పుడు అందరిని అందరిని ఇబ్బందులు పెడుతున్నది.